సాక్షి, హైదరాబాద్: కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది పి.సుగుణాకర్రావును పార్టీ తరపున పోటీలో నిలపాలని నిర్ణయించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఆయనకు బీఫాం కూడా అందజేసినట్లు ఆయ న వెల్లడించారు. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పట్ల, నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి బలమైన అభ్యర్థి సుగుణాకర్రావుతో పోటీ చేయిస్తున్నామన్నారు. విద్యావంతులు తమ మొదటి ప్రాధాన్య ఓటును సుగుణాకర్రావుకు వేసి గెలిపించాలని కోరారు.
స్వతంత్రులుగా రణజిత్ మోహన్, రవి!
బీజేపీ రాష్ట్ర నాయక త్వం మొదటి నుంచీ సుగుణాకర్రావును పోటీలో నిలపా లని శ్రద్ధ చూపుతున్న నేప థ్యంలో పార్టీనే నమ్ముకుని, ఉద్యోగాన్ని వదులుకుని పనిచేస్తున్న తనకు పార్టీ మద్దతు ఇవ్వాలని రణజిత్ మోహన్ పట్టుబట్టారు. ఎడ్ల రవి కూడా తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ వర్గాలను కోరారు. రణజిత్మోహన్ ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు కోసం పార్టీ వర్గాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నించారు. కానీ పార్టీ గురు వారం బీఫాంను సుగుణాకర్రావుకు ఇవ్వడం తో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని రణజిత్మోహన్ ప్రకటించారు. మరోవైపు ఎడ్ల రవి కూడా బరిలో నిలిచే అవకాశముంది.
సుగుణాకర్రావుకు బీజేపీ బీఫాం
Published Fri, Mar 8 2019 12:50 AM
# Tag
Related news
-
అప్పుడలా.. ఇప్పుడిలా..
పింఛను లబ్ధిదారుల్లో ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ పింఛను డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోకి జమచేయాలి. సచివాలయాల దాకా వెళ్లి పింఛన్లు తీసుకోలేని వారికి మినహాయింపులు ఇవ్వొచ్చు. అలాంటి వారికి ఇంటి దగ్గరకు వెళ్లి ఇవ్వడానికి మా సిటిజన్ ఫర్ డెమోక్రసీకి అభ్యంతరంలేదు. ఇక బ్యాంకు అకౌంట్లులేని వారు సచివాలయంలో పింఛను డబ్బులు తీసుకునే అవకాశం కల్పించాలని ఈసీ అధికారులను కోరాం.– చంద్రబాబు నమ్మినబంటు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 20 రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన తర్వాత మీడియాతో అన్న మాటలు.తాము 2024 మార్చి 30న పేర్కొన్న ఆదేశాల ప్రకారం.. బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ (బ్యాంకు ఖాతాలో జమచేసే) విధానంలో పింఛన్ల పంపిణీకే ప్రాధాన్యత ఇవ్వండి. లేదంటే శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేపట్టండి. – ఏప్రిల్ 26న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జారీచేసిన ఆదేశాల సారాంశం ఇది. ఏప్రిల్లో దివ్యాంగులకు ఇళ్లవద్దే.. మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ కొనసాగించడంపైనా టీడీపీ–బీజేపీ–జనసేన నేతలు 20 రోజులుగా రోజూ ఫిర్యాదులు చేయడంతో ఈసీ జారీచేసిన ఆదేశాలివి.టీడీపీ–బీజేపీ–జనసేన నేతల వరుస ఫిర్యాదులతో మే ఒకటి నుంచి చేపట్టే పింఛన్ల పంపిణీ డీబీటీ విధానంలో అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘమే స్పష్టంగా ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో బ్యాంకు ఖాతాలున్న 75 శాతం మంది పింఛనర్లకు బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ల జమకు అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 58 నెలలుగా ప్రతినెలా ఠంఛన్గా ఒకటో తేదీనే వలంటీర్ల ద్వారా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీని నెలరోజుల క్రితం అడ్డుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద కూడా ఆ పంపిణీ కొనసాగకూడదంటూ రోజూ అదేపనిగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి, మళ్లీ అవ్వాతాతలు తనపై ఎక్కడ ఆగ్రహం చూపుతారోనని భయంతో ‘పండుటాకులను బ్యాంకుల చుట్టూ తిప్పిస్తారా’ అంటూ చంద్రబాబు ఎప్పటిలాగే ప్లేటు ఫిరాయించారు. నిజానికి.. మొదటినుంచీ చంద్రబాబుది ఇదే తరహా రాజకీయం. ఏ అంశంపైనైనా ముందు తప్పుచేసేసి దాన్ని సరిదిద్దుకునేందుకు ఎదుటివారిపై బురదజల్లుతూ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తారు. రాష్ట్ర విభజన సమయంలో.. ప్రత్యేక హోదా తదితర అంశాల విషయంలో ఆయన అనేకమార్లు బొక్కబోర్లాపడినా తనదే పైచేయి అని బిల్డప్ ఇచ్చే రకం. ఎన్నికల కోడ్ను అడ్డంపెట్టుకుని వలంటీర్లపై చంద్రబాబు అవలంబించిన వైఖరి కూడా అచ్చం ఇలాంటిదే. నెలరోజుల క్రితం..నిజానికి.. నాలుగున్నరేళ్లకు పైగా రాష్ట్రంలో వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతినెలా ఠంఛనుగా లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ కొనసాగగా.. ఈ వర్గానికి చెందిన ఓట్లు టీడీపీకి దక్కవేమోనన్న దుగ్థతో ఎన్నికల నేపథ్యంలో ఈ విధానంపై పచ్చముఠా ఇప్పుడు వరుసపెట్టి ఫిర్యాదులు చేసింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా ఈ ఏడాది మార్చి ఒకటిన ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే, చంద్రబాబు జేబులోని మనిషి, ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్కుమార్ అయితే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేరుతో అచ్చం ఇదే పనిమీద ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25 తేదీల్లో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను దూరంగా ఉంచాలని రెండుసార్లు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటివరకు ఇళ్లవద్దే ఇస్తున్న పింఛన్ల పంపిణీకి బ్రేకులు పడ్డాయి. ఫలితంగా.. ఏప్రిల్ నెల దివ్యాంగులు, కదలలేని స్థితిలో ఉండే అవ్వాతాతలకు ఇబ్బందిలేకుండా వారికి ఇంటివద్దే పింఛన్లను పంపిణీ చేసి, మిగిలిన వారికి సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేశారు. ఈ నిర్ణయంపై పింఛనర్లు తీవ్రస్థాయిలో రగిలిపోయారు. చంద్రబాబు, ఆయన ముఠా తీరుపై బహిరంగంగానే విరుచుకుపడ్డారు. ఆగని ఫిర్యాదులు..చంద్రబాబు ముఠా కోరుకున్నట్లుగా తీసుకున్న ఈ పింఛన్ల పంపిణీ నిర్ణయం ఆయనకే బెడిసికొట్టింది. అనుకున్నదొకటి.. అయినదొక్కటి బోల్తాకొట్టిందిరో బాబు పిట్ట అన్నట్లుగా తయారైంది ఆయన పరిస్థితి. దీంతో తన సహజ లక్షణమైన యూటర్న్ను తీసేసుకున్నారు. అంతే.. మళ్లీ గత నెలరోజులుగా టీడీపీ–జనసేన–బీజేపీతో కూడా పచ్చబ్యాచ్ ఉమ్మడిగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపర కొనసాగించింది. ఇందులో భాగంగానే నిమ్మగడ్డ 20 రోజుల క్రితం మళ్లీ ఎన్నికల సంఘం అధికారులను కలిసి, పింఛన్ల పంపిణీ సచివాలయాల వద్ద కాకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేయాలని కోరారు. ఇలా దాదాపు రోజు మార్చి రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. మరోపక్క.. తమ అనుకూల మీడియాలో రాష్ట్ర ఉన్నతాధికారులను బ్లాక్మెయిల్ చేసేలా నిత్యం కథనాలు రాయించి బ్యాంకుల ద్వారా పింఛన్లను పంపిణీ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. సెలవైనా ఒకటినే బ్యాంకులో పింఛను..మేడే కారణంగా బ్యాంకులకు సెలవు అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ఒకటో తేదీనే పింఛను డబ్బులను అందుబాటులో ఉంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,945.39 కోట్లు విడుదలచేసింది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులతో పాటు తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్లకు పరిమితమయ్యే 16,57,361 మందికి ఒకటో తేదీ (బుధవారం) ఉదయం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు పంపిణీ చేపట్టేలా మంగళవారమే వారికి సంబంధించిన రూ.474.17 కోట్లను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన 48,92,503 మంది లబ్ధిదారుల పింఛన్ డబ్బులు బుధవారం బ్యాంకులకు సెలవు అయినప్పటికీ అదేరోజు ఉ.8 గంటల నుంచి వారి ఖాతాల్లో జమయ్యేలా అన్ని బ్యాంకులు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.– సాక్షి, అమరావతి -
గుజరాత్ పెత్తనమా.. తెలంగాణ పౌరుషమా?: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ భూపాలపల్లి/ సాక్షి, రంగారెడ్డి జిల్లా/ దిల్సుఖ్నగర్ (హైదరాబాద్): కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలపై సర్జికల్ స్ట్రైక్ చేసి రిజర్వేషన్లు రద్దు చేస్తారని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీకి ఓటు వేస్తే విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు లభించవని, బలహీన వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు ఆత్మ బీజేపీ నేత అమిత్ షాను ఆవహించిందని, ఆ రెండు పార్టీలు ఒక్కటై రాష్ట్రంలో గూడు పుఠాణి చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ అనామకులకు ఎంపీ టికెట్ ఇచ్చిందని అన్నారు. డిసెంబర్లో జరిగిన సెమీఫైనల్ ఎన్నికల్లో కేసీఆర్ను బొంద పెట్టామని, ఇప్పుడు జరిగే ఫైనల్ మ్యాచ్లో తెలంగాణ పౌరుషం గుజరాత్కు తెలిసేలా మోదీని ఓడించాలని ప్రజలను కోరారు. ఫైనల్స్లో మోదీ, అమిత్షాలను ఓడించి, రాహుల్గాం«దీని ప్రధానిని చేసినప్పుడే మనం గెలిచినట్లు అని పేర్కొన్నారు. ‘గుజరాత్ పెత్తనమా.. తెలంగాణ పౌరుషమా? తేల్చుకుందాం..’ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన జనజాతర సభల్లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ శివారు బాలాపూర్, బడంగ్పేట్, సరూర్నగర్లో, మహేశ్వరం నియోజకవర్గంలోని ఎన్టీఆర్ నగర్లో రోడ్ షో అనంతరం కార్నర్ మీటింగుల్లో ప్రసంగించారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు ‘కులగణన చేపట్టి దామాషా ప్రకారం బలహీనవర్గాలకు రిజర్వేషన్లు తీసుకురావాలని మేము ప్రయత్నిస్తుంటే, బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోందో మోదీ సమాధానం చెప్పాలి. బీజేపి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వారిని గద్దె దించుతారు. ప్రధానిగా మోదీ పదేళ్లలో తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదు. బండి సంజయ్ కరీంనగర్కు తెచ్చిందేమీ లేదు.. గాడిద గుడ్డు తప్ప. గుండు అర్వింద్, అరగుండు సంజయ్లు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి. పదేళ్లలో మోదీ కర్ణాటకకు చెంబు, ఏపీకి పాచిపోయిన లడ్డూలు, మట్టి, నీళ్లు, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు..’ అని రేవంత్ ఎద్దేవా చేశారు. మోదీ, షాలకు కర్రుకాల్చి వాత పెట్టాలి ‘మోదీ అన్ని రకాలుగా మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వేకోచ్లను రద్దు చేశారు. ఏటా ఐదు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి ఒక్కరికీ ఇవ్వలేదు. రైతుల ఆదాయం పెంచుతామని చెప్పి రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ మోసం చేసినందుకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. అదే విధంగా నరేంద్ర మోదీకి, అమిత్షాకు కర్రు కాల్చి వాత పెట్టాలి..’ అని సీఎం అన్నారు. సైనికుల్ని పంపించినా భయపడేది లేదు ‘తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రంలో డ్రగ్స్ నిషేధిస్తుంటే వాటి మూలాలు గుజరాత్లో వెలుగు చూస్తున్నాయి. కేసీఆర్ ఉపన్యాసాన్ని మోదీ నకలు కొట్టారు. నన్ను తిడితే ఏం వస్తుంది? సలహాలు ఇవ్వాల్సింది పోయి అడ్డగోలుగా తిట్టిపోయిండు. కేసీఆర్, కిషన్రెడ్డి కూడా ఇదే పని చేస్తున్నారు. తిట్టడానికి ఇంత దూరం రావలసిన అవసరం లేదు. హైదరాబాద్ మెట్రో రైలుకు నిధులు కేటాయించలేదు. బుల్లెట్ రైలు ఇవ్వలేదు. వరంగల్కు ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్రోడ్డు రాకుండా ప్రధాని అడ్డుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన నన్ను కేసీఆర్ తరహాలోనే అరెస్టు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. కేసీఆర్ బెదిరిస్తేనే భయపడలేదు. తాజాగా మోదీ ఢిల్లీ పోలీసులను పంపాడు. వాళ్లకు భయపడతామా? సైనికుల్ని పంపించినా భయపడేది లేదు. రేవంత్రెడ్డికి జైలు కొత్త కాదు..’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాజకీయం కోసం రాముడి అక్షింతలు పంచారు ‘అయోధ్యలో రాముడి కల్యాణానికి 15 రోజుల ముందే రాజకీయం కోసం శ్రీరాముడి అక్షింతలు ఇంటింటా పంచి బీజేపీ అవమానించింది. రాజకీయాల కోసం రాముడిని వాడుకుంటున్న విషయాన్ని హిందువులందరూ ఆలోచించాలి. మనమందరం హిందువులం కాదా? రామభక్తులం కాదా? అయినా ఓట్ల కోసం హిందుత్వాన్ని ఎప్పుడూ వాడుకోలేదు..’ అని రేవంత్ అన్నారు. ఇండియా కూటమిలోకి కేసీఆర్ను తీసుకోం ‘బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ను ఓడించేందుకు, బీజేపీని గెలిపించేందుకు పలు స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను కేసీఆర్ పోటీలో నిలిపారు. బీఆర్ఎస్ను ఇండియా కూటమిలోకి తీసుకోం. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ నన్ను వేధించి కేసులు పెట్టి జైలుకు పంపాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అక్రమ కేసులు పెట్టింది. కేసీఆర్ మళ్లీ పగటి కలలు కంటున్నాడు. వంద రోజుల్లోనే కాంగ్రెస్ను దిగిపోవాలంటున్నాడు. నేను ప్రజల మద్దతుతో సీఎం అయ్యా. ఏడాది కాదు..కేసీఆర్? నీ జీవితం మొత్తం ఎదురు చూసినా మళ్లీ నీకు సీఎం పదవి రాదు. తిక్కలోడు తిరనాళ్లకు పోయినట్లు కేసీఆర్ బస్సుయాత్ర ఉంది..’ అని సీఎం విమర్శించారు. కొండా రాజ్యసభ సీటు కొనుక్కోవచ్చు ‘మాజీ మంత్రి సబితమ్మ పొద్దున కారు గుర్తు అంటుంది. రాత్రిపూట కమలం గుర్తుకు ప్రచారం చేస్తుంది. సొంత పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టింది. కొండా విశ్వేశ్వర్రెడ్డి రాజకీయాన్ని కూడా ఓ వ్యాపారంగా చూస్తున్నాడు. పదేళ్లు తెలంగాణను మోసం చేసిన మోదీ పక్కన చేరి మళ్లీ ఇక్కడి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. వందల కోట్లు ఉన్న కొండాకు నిజంగానే ప్రజా సేవ చేసే ఆలోచన ఉంటే.. రూ.కోట్లు పెట్టి ఏ రాజ్యసభ సీటో కొనుక్కోవొచ్చు..’ అని రేవంత్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, దనసరి సీతక్క, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకా‹Ùరెడ్డి, కేఈఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కరీంనగర్, వరంగల్, చేవెళ్ల పార్టీ అభ్యర్థులు వెలిచాల రాజేందర్రావు, కడియం కావ్య, గడ్డం రంజిత్రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వడదెబ్బతో వృద్ధురాలు మృతి జమ్మికుంట (హుజూరాబాద్): జమ్మికుంటలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంబాల ఐలమ్మ (68) వడదెబ్బకు గురై సభలోనే కుప్పకూలింది. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఐలమ్మ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి సహాయం అందేలా చూస్తానని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ హామీ ఇచ్చారు. -
సీఎం జిల్లాపై పట్టెవరిది?
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పాలమూరులో రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. ప్రస్తుత లోక్సభ పోరు కూడా ఆసక్తికరంగానే మారింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. డీకే.అరుణ (బీజేపీ), చల్లా వంశీచంద్రెడ్డి (కాంగ్రెస్), మన్నె శ్రీనివాస్రెడ్డి (బీఆర్ఎస్) నువ్వా..నేనా అన్నట్టుగా గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా అ్రస్తాలు సంధిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. మహబూబ్నగర్ లోక్సభ స్థానానికి 1952 నుంచి ఇప్పటివరకు 17 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా.. పదిసార్లు కాంగ్రెస్, మూడు దఫాలు బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్), తెలంగాణ ప్రజాసమితి, జనతాదళ్, జనతా పార్టీ, బీజేపీ ఒక్కోసారి మాత్రమే విజయం సాధించాయి. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా కావడం.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఈ పార్లమెంట్ పరిధిలోకి రావడంతో ఇక్కడ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ స్థానంలో విజయం సాధించి కాంగ్రెస్ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకొని, తిరిగి పట్టు సాధించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ సర్వశక్తులొడ్డుతోంది. కాంగ్రెస్: కొడంగల్ స్కీం, ముదిరాజ్లపై ఆశలుమహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఏడు పర్యాయాలు పర్యటించారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రూ.4వేల కోట్లతో చేపట్టిన మక్తల్–నారాయణపేట–కొడంగల్’పథకంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన విషయాన్ని పదేపదే ఓటర్లకు వివరిస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో అధిక శాతం ఓటర్లుగా ఉన్న ముదిరాజ్లను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మారుస్తామని హామీ ఇచ్చిన ఆయన.. పాలమూరు ప్రాజెక్ట్కు జాతీయ హోదా తీసుకురాకపోవడం, తగిన నిధులు కేటాయించకపోవడంపై బీజేపీ, బీఆర్ఎస్పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ అంశాలు తమ గెలుపునకు దోహదం చేస్తాయనే ధీమా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే మహబూబ్నగర్, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవ ర్గా ల్లోని పలు మండలాల్లో నాయకులు, కేడర్ మధ్య సమన్వయం కొరవడినట్టు తెలుస్తోంది. చేరికల క్రమంలో పాత, కొత్త నేతల మధ్య వైరం ముదిరినట్టు సమాచారం. బీజేపీ: మోదీ చరిష్మా, కేంద్ర పథకాలపై.. బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ మహిళానేత డీకే.అరుణ రెండోసారి బరిలో దిగారు. గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన ఆమె ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో శ్రమిస్తున్నారు. ‘విజయ్ సంకల్స్ యాత్ర’పేరుతో పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేసిన ఆమె.. నియోజకవర్గ కేంద్రాల్లో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. మోదీ చరిష్మా, కేంద్ర పథకాలు తన గెలుపునకు దో హదం చేస్తాయని బలంగా చెబుతున్న ఆమె.. పాలమూరు ప్రాజెక్టుల సాధనలో తనదే ముఖ్యపాత్ర అని ప్రజల ముందుకు తీసుకెళుతున్నారు. అధికసంఖ్యలో ఉన్న ఎస్సీ సా మాజికవర్గ ఓట్లు తనకు కలిసివస్తాయనే ఆశతో ఉ న్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలకు దీటు గా సమాధానం చెబుతూ తనదైన శైలిలో ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే జితేందర్రెడ్డి, జలంధర్ రెడ్డి వంటి నాయకులు బీజేపీ ని వీడి కాంగ్రెస్లో చేర డం, ఆమెకు కొంత మైనస్గా మారినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్: కేసీఆర్పైనే భారం బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి రెండోసారి బరిలో నిల్చున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం అలుముకుంది. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఇతర పార్టీల కంటే ఆలస్యం కాగా.. ప్రచారంలో కొంత వెనుకబడ్డారు. అయితే పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగడం.. బస్సు యాత్ర ద్వారా మహబూబ్నగర్లో నిర్వహించిన భారీ రోడ్షో, కార్నర్ మీటింగ్కు పెద్దఎత్తున ప్రజలు హాజరుకావడంతో ‘గులాబీ’శ్రేణుల్లో జోష్ నెలకొంది. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని..అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేక చతికిలపడిందంటూ తనదైన పంథాలో విమర్శలు గుప్పిస్తూనే..ఈ పార్లమెంట్ స్థానంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లు టార్గెట్గా ప్రసంగించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొందని.. అందరూ కృషి చేస్తే మన్నె శ్రీనివాస్రెడ్డి గెలుపు తథ్యమని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.ప్రభావం చూపే అంశాలు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా అచ్చంపేట–తాండూరు, కృష్ణా–వికారాబాద్ రైల్వే లేన్ పెండింగ్ గద్వాల–మాచర్ల లేన్కు అడుగులు పడకపోవడం నారాయణపేటకు మంజూరైన సైనిక్ స్కూల్ తరలిపోవడంపై నిరసన గద్వాల, నారాయణపేటలో చేనేతలకు టెక్స్టైల్ పార్కు ఏర్పాటు డీకే అరుణ (బీజేపీ)వంశీచంద్రెడ్డి (కాంగ్రెస్) శ్రీనివాస్రెడ్డి (బీఆర్ఎస్) 2019 ఎంపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల వారీగా అభ్యర్థులకు పోలైన ఓట్లు.. టీఆర్ఎస్ – మన్నె శ్రీనివాస్రెడ్డి4,11,402 (41.78 శాతం)బీజేపీ – డీకే అరుణ3,33,573 (33.88 శాతం)కాంగ్రెస్ – చల్లా వంశీచంద్రెడ్డి1,93,631 (19.67 శాతం) -
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
గోల్కొండ: ప్రపంచంలోనే అత్యుత్తమమైన భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని మజ్లిస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ చేతుల్లో కీలు»ొమ్మ అయిన బీజేపీ దళితులు, ముస్లింలకు పక్కా వ్యతిరేకి అని విమర్శించారు. మంగళవారం గోల్కొండ ఎండిలైన్స్ చౌరస్తా వద్ద జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్భగవత్ ఒకొక్కటిగా తమ ఎజెండాను అమలు చేస్తూ దేశ విచ్చిన్నానికి కుట్రలు చేస్తున్నారని నిందించారు. గత పదేళ్ల పాలనలో దళితులు, ముస్లింల సంక్షేమానికి ఏమీ చేయని పీఎం మోదీ ఇప్పుడు వారి రిజర్వేషన్లను సైతం రద్దు చేసేందుకు పక్కాగా ప్లాన్ చేశారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం నాయకుల హత్యాకాండ నేరుగా అక్కడి ప్రభుత్వాల కనుసన్నల్లోనే కొనసాగుతోందని ఒవైసీ ధ్వజమెత్తారు. ముస్లిం నేతలు అరెస్టయి జైలుకు వెళ్లే వారు సజీవంగా తిరిగిరావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లో ముస్లిం నేతలను పోలీసులే చంపారని ఆయన గుర్తు చేశారు. నన్ను ఓడించేందుకు మోదీ, అమిత్ షా పాట్లు హైదరాబాద్లో అరాచక వాతావరణం నెలకొల్పేందుకు బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఒవైసీ ఆరోపించారు. హైదరాబాద్ స్థానం నుంచి తనను ఓడించేందుకు మోదీ, అమిత్ షాలు పడరాని పాట్లు పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మతసామరస్యానికి పెట్టిన పేరైన హైదరాబాద్ ఓటర్లు ఎంతో వివేకవంతులనీ, శాంతిభద్రతలు నగర అభివృద్ధి కోరుకుని తనను గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దీన్, కార్పొరేటర్ నసీరుద్దీన్, మహ్మద్ గౌస్ తదితరులున్నారు. -
మోదీ సభతో బీజేపీలో జోష్
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్న బీజేపీలో ప్రధాని మోదీ బహిరంగసభ నూతనోత్సాహాన్ని నింపింది. ఈ సభ లో యువత పెద్దసంఖ్యలో పాల్గొనడం, మోదీ ప్రసంగం సందర్భంగా కరతాళధ్వనులు, నినాదాలతో హోరెత్తించడం పార్టీ కేడర్లో హుషారు తెచ్చింది. ఈ సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి కాంగ్రెస్ నాయకులకు నిద్రపట్టదంటూ మోదీ తన ప్రసంగం సందర్భంగా వ్యాఖ్యానించారు. మంగళవారం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అల్లాదుర్గ్లో నిర్వహించిన సభ సక్సెస్ కావడం పట్ల పార్టీ ముఖ్యనేతలు సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీబీ పాటిల్ను, మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఎం.రఘునందన్రావును గెలిపించాలంటూ మోదీ కోరడంతోపాటు, ఈ ప్రాంతానికి సంబంధించి కేంద్రంలోని తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడంపై ప్రజల్లో మంచి స్పందన కనిపించింది, మళ్లీ మే 8న వేములవాడలో, మే 10న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగసభల్లో మోదీ పాల్గొననున్నారు. నేడు అమిత్షా రోడ్షో... బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్ షా బుధవారం హైదరాబాద్ లోక్సభ పరిధిలో రోడ్షో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్టులో దిగుతారు. ఆ తర్వాత పాతబస్తీ లాల్దర్వాజ మహంకాళి ఆలయం నుంచి అక్కడికి దగ్గరలోని సుధ టాకీస్ వరకు రోడ్షో నిర్వహిస్తారు. రాత్రి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చేవెళ్ల, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాల్లో పార్టీపరంగా చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్షిస్తారు.
Related News by category
-
‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
సాక్షి, ఆదిలాబాద్: జీవితంలో ఎవరైనా ఏదైనా సక్సెస్ సాధిస్తే మొదట కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకుంటారు.. అయితే మాజీ ఎంపీ మధుసూదన్రెడ్డికి మాత్రం ఈ సంతోషం పంచుకునేందుకు ఆ అవకాశం లేకుండా పోయింది.. ఆయన భార్య అప్పటికే విగత జీవి.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైన తర్వాత కొద్ది రోజులకు ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు కారులో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా తుప్రాన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లిపోగా ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మార్చిలో ఈ ప్రమాదం జరగగా ఏప్రిల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మూడేళ్ల తర్వాత ఆయన ఎంపీగా ఉన్న కాలంలోనే ఆమె అదే పరిస్థితిలో ఈ లోకం విడిచి వెళ్లిపోయింది.న్యాయవాద వృత్తి నుంచి..ఆదిలాబాద్లో టి.మధుసూదన్రెడ్డి అప్పటికే దశాబ్దాలుగా ప్రముఖ న్యాయవాదిగా పేరు గడించారు. అప్పుడు 58 ఏళ్ల మధ్య వయస్సు.. భార్య భూలక్ష్మి, అప్పటికే పెళ్లిళ్లు జరిగిన కుమారుడు ప్రకాష్రెడ్డి, కూతురు సంగీత, మనుమలు, మనుమరాళ్లతో సంతోషంగా గడుపుతున్నారు. 2004లో ఆయనకు బీఆర్ఎస్ నుంచి ఆదిలాబాద్ ఎంపీ టిక్కెట్ ఖరారైంది. మార్చి 1న ఆయన ఆదిలాబాద్కు చెందిన ఓ న్యాయవాది కూతురి వివాహం హైదరాబాద్లో ఉండడంతో మధుసూదన్రెడ్డి భార్య భూలక్షి్మతో కలిసి కారులో డ్రైవర్తో సహా బయల్దేరి వెళ్లారు. అయితే మార్గమధ్యలో మధుసూదన్రెడ్డి కారు నడుపుతుండగా భార్య ముందర కూర్చుంది.డ్రైవర్ వెనుక సీటులో ఉన్నాడు. తుప్రాన్ వద్ద అనుకోని పరిస్థితిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భూలక్షి్మకి తీవ్ర గాయాలు కాగా మధుసూదన్రెడ్డికి మెడ వద్ద స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఈ ఇద్దరిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే భూలక్ష్మి కోమాలోకి వెళ్లిపోయింది. మధుసూదన్రెడ్డి చికిత్స అనంతరం తేరుకున్నారు. ఏప్రిల్ 20న 14వ లోక్సభ మొదటిదశ ఎన్నికలు జరిగాయి. మే 13న ఫలితాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదన్రెడ్డి 4,15,429 ఓట్లు, టీడీపీ అభ్యర్థి వేణుగోపాల్చారి 3,74,455 ఓట్లు సాధించారు. ఆదిలాబాద్ ఎంపీగా మధుసూదన్రెడ్డి గెలిచారు. ప్రముఖ న్యాయవాదిగా తన విజయాన్ని చూసిన భాగస్వామి భూలక్ష్మి ప్రజాప్రతినిధిగా ఎంపికయ్యారన్న విషయం కూడా తెలియకుండానే కోమాలోనే 2007లో ఆమె కన్ను మూశారు.మొదటిసారి ఎన్నికల్లో..బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ 2001 సంవత్సరంలో ఆవిర్భవించింది. 2004 సాధారణ ఎన్నికల్లో యూపీఏ భాగస్వామ్య పార్టీలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది. కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి రాష్ట్రంలో పోటీ చేసింది. కొత్త పార్టీగా ఆ ఎన్నికల్లో 26 అసెంబ్లీ స్థానాలతో పాటు ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందింది. ఈ ఎన్నికల్లోనే ఆదిలాబాద్ ఎంపీగా మధుసూదన్రెడ్డి గెలిచారు. ఆ ఐదుగురు ఎంపీల్లో పార్టీ అధినేత కేసీఆర్ కరీంనగర్ నుంచి గెలుపొందగా మెదక్ నుంచి ఆలె నరేంద్ర, హన్మకొండ నుంచి బి.వినోద్ కుమార్, వరంగల్ నుంచి దరావత్ రవీందర్ నాయక్ ఉన్నారు. దేశంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ప్రత్యేక రాష్ట్ర సాధన ధ్యేయమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఉండగా, ఆ దిశగా యూపీఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందడుగు లేకపోవడంతో 2006లో బీఆర్ఎస్ యూపీఏ నుంచి వైదొలిగింది. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేశారు. అందులో మధుసూదన్రెడ్డి కూడా ఉన్నారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మధుసూదన్రెడ్డి తిరిగి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆదిలాబాద్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రకరణ్రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో కృంగిపోకుండా ఆయన తిరిగి న్యాయవాది వృత్తి చేపట్టడం గమనార్హం. 2015లో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. -
టెన్త్లో మళ్లీ నిర్మల్ టాప్.. అమ్మాయిలదే హవా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్లో మాదిరిగానే టెన్త్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. రెగ్యులర్ విభాగంలో బాలురు కన్నా 3.81 శాతం, ప్రైవేటు (కంపార్ట్మెంటల్) విభాగంలో 6.74 శాతం ఎక్కువ ఉత్తీర్ణతను నమోదు చేశారు. మొత్తంగా ఈ ఏడాది రెగ్యులర్ విద్యార్థులు 91.31 శాతం, ప్రైవేటు విద్యార్థులు 49.73 శాతం పాసయ్యారు. నిర్మల్ జిల్లా 99.05 శాతం ఉత్తీర్ణతతో గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వికారాబాద్ జిల్లా 65.10 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరిగిన పదవ తరగతి పరీక్షా ఫలితాలను పాఠశాల విద్య కమిషనర్ దేవసేన, రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం హైదరాబాద్లో వెల్లడించారు. 5,05,813 మంది పరీక్షలు రాస్తే 4,57,044 మంది ఉత్తీర్ణత సాధించినట్టు వారు తెలిపారు. రెగ్యులర్గా రాసిన వారిలో బాలికలు 2,28,616 (93.23%), బాలురు 2,22,656 (89.42%) మంది పాసయ్యారు. ప్రైవేటులో బాలికలు 2,178 (54.14%) మంది, బాలురు 3,594 (47.40%) మంది పాసయ్యారు. ఆరు స్కూళ్లలో సున్నా ఉత్తీర్ణత గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. 3,927 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఆరు స్కూళ్ళలో ఒక్కరు కూడా పాసవ్వలేదు. గురుకుల పాఠశాలలు 98.71 శాతం అత్యధిక పాస్ పర్సంటేజీతో దూసుకెళ్ళాయి. జిల్లా పరిషత్, ఇతర ప్రభుత్వ పాఠశాలలు సగటు ఉత్తీర్ణత శాతం కన్నా తక్కువ పర్సంటేజీ దక్కించుకున్నాయి. 15 రోజుల్లోగా రీ కౌంటింగ్, వెరిఫికేషన్ మార్కుల రీ కౌంటింగ్, ఫలితాల రీ వెరిఫికేషన్ కోరుకునేవారు 15 రోజుల్లో (మే 15లోగా) దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ తెలిపింది. రీ కౌంటింగ్కు సబ్జెక్టుకు రూ.500 చెల్లించి, దరఖాస్తులను పాఠశాల విద్య కార్యాలయానికి పంపాలి. రీ వెరిఫికేషన్కు సబ్జెక్టుకు రూ. 1,000 చెల్లించాలి. హాల్ టిక్కెట్ జిరాక్స్, మార్కుల మెమో కాపీతో కూడిన రీ వెరిఫికేషన్ దరఖాస్తును సంబంధిత డీఈవో కార్యాలయానికి పంపాలి. వీరికి మూల్యాంకనం చేసిన సమాధాన పత్రం ప్రతిని పంపుతారు. జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13 వరకూ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం ఎదురు చూడకుండా ఈ పరీక్షలకు దరఖాస్తు చేయాలని విద్యాశాఖ కోరింది. మే 16లోగా సంబంధిత స్కూల్ హెచ్ఎంలకు పరీక్ష ఫీజు చెల్లించాలి. ఒత్తిడికి లోనవ్వొద్దు : బుర్రా వెంకటేశం ఫెయిల్ అయిన, గ్రేడ్లు తగ్గిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురికావద్దంటూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విజ్ఞప్తి చేశారు. ఫెయిల్ అయిన వారు సప్లిమెంటరీ రాసుకుని ఇంటర్లో చేరేందుకు అవకాశం ఉందన్నారు. అన్ని పరీక్షలు ఫెయిల్ అయినా, జీవితంలో అద్భుతంగా రాణించిన వారు ఎంతోమంది ఉన్నారని సూచించారు. పాఠశాల విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచే చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు. ‘పది’లో సత్తా చాటిన గురుకులాలు రాష్ట్రవ్యాప్తంగా సగటున 96.33 శాతం ఉత్తీర్ణత అత్యధికంగా జనరల్ సొసైటీలో 98.70శాతం పాస్ పెరుగుతున్న టెన్త్ ఉత్తీర్ణత – 2015లో 77 శాతం.. 2024లో 91 శాతం ఉత్తీర్ణత – 8 రెట్లు పెరిగిన 10 జీపీఏ విద్యార్థులు – ప్రైవేటుతో పోటీ పడుతున్న గురుకులాలు, మోడల్ స్కూల్స్ -
‘పోలీస్ బోర్డు’ ద్వారా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ‘పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు’ ద్వారా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ఎంపిక చేయనున్నారు. ఆర్టీసీలో మూడు వేల ఖాళీల భర్తీకి ఇటీవల ఆ సంస్థ ప్రతిపాదించింది. ఆర్థికశాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఆ ప్రతిపాదన ఎన్నికల కోడ్ ముగిశాక సీఎం పరిశీలనకు వెళుతుంది. దానికి ఆయన ఆమోదముద్ర వేయగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కు ఆర్టీసీ ఉద్యోగుల ఎంపిక బాధ్యత అప్పగించటంపై ఆయన ఎలాంటి అభ్యంతర్థిరం వ్యక్తం చేయకపోతే ఈ నియామకాలు చకచకా జరుగుతాయి. టీఎస్పీఎస్సీ అనాసక్తితో.. దశాబ్దాలుగా అంతర్గత ఉద్యోగాల నియామకా లను సొంతంగా ఆర్టీసీనే చూస్తూ వచ్చింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఓ దశలో దీనిని ప్రశ్నించింది. ప్రభుత్వ సంస్థల్లో అన్ని రకాల నియామకాలను టీఎస్పీఎస్సీ పర్యవేక్షిస్తుండగా, ఆర్టీసీలో ఆ సంస్థ చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో అప్పటి వరకు నియామకాలు లేకపోవటం, తొలిసారి ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన తరుణంలో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగాల ఎంపిక కూడా టీఎస్పీఎస్సీనే చూడాలని ఆదేశించింది. తొలుత ఆర్టీసీ ఫైనాన్స్, పర్సనల్ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టింది. కానీ అప్పట్లో వాటి నియామకాలు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. డ్రైవర్ల నియామక ప్రక్రియ వరకు వచ్చేసరికి టీఎస్పీఎస్సీ చేతులెత్తేసింది. ఇతర ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో బిజీగా ఉండగా, వీటిని చేపట్టడం సాధ్యం కాదని పేర్కొంది. దీంతో విషయం నాటి ప్రభుత్వ చివరిదశలో మరోసారి ప్రభుత్వ పరిశీలనకు వెళ్లింది. మళ్లీ దీనిపై సమాలోచనలు చేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అప్పగించింది. ఈలోపు ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారిపోవటంతో ఆ ప్రక్రియ అలాగే ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కలి్పంచటంతో బస్సుల సంఖ్య భారీగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఉద్యోగుల కొరత ఉన్న సమయంలో కొత్త బస్సులు సమకూర్చుకుంటే వాటి నిర్వహణ అసాధ్యంగా మారే పరిస్థితి ఉంది. దీంతో 8 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని నిర్ణయించి ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదించింది. అన్ని నియామకాలు వద్దని ఆర్థికశాఖ మౌఖికంగా సూచించంతో 3 వేల పోస్టుల భర్తీకి మళ్లీ ప్రతిపాదించింది. ఇందులో 2 వేల మంది డ్రైవర్లు ఉండగా శ్రామిక్లు, డిపో మేనేజర్లు ఇలా మిగతా విభాగాలకు చెందిన మరో వెయ్యి మంది ఉన్నారు. సీఎం గ్రీన్సిగ్నల్ ఇస్తే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మూడు వేల ఆర్టీసీ ఖాళీల భర్తీ ప్రక్రియ చేపడతారు.డ్రైవర్ల డబుల్ డ్యూటీ రూ.వెయ్యికి పెంపు ప్రస్తుతం ఆర్టీసీలో ‘లక్షే లక్ష్యం’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. 2017 నాటి వేతన సవరణ అమలు చేయనుండటంతో ఆర్టీసీపై రోజువారీగా రూ.కోటి చొప్పున భారం పడుతుంది. ఆ భారాన్ని పూడ్చుకునేందుకు సంస్థ, రోజువారీ ఆదాయాన్ని రూ.కోటి మేర అదనంగా పెంచుకోవాలని నిర్ణయించింది. ఇందుకుగాను ప్రతి డిపో రోజుకు రూ.లక్ష చొప్పున ఆదాయాన్ని పెంచుకునే కసరత్తు ప్రారంభించింది. లక్షే లక్ష్యం పేరుతో దీనిని చేపట్టింది. కానీ, ఈ రూపంలో డ్రైవర్లపై భారం మరింత పెరిగిందంటూ ఇటీవల డిపో మేనేజర్లు ఎండీ దృష్టికి తెచ్చారు. తీవ్ర ఎండలున్న ప్రస్తుత తరుణంలో ఇది ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. దీంతో మే, జూన్ నెలలకు సంబంధించి డ్రైవర్ల డబుల్ డ్యూటీ మొత్తాన్ని రూ.వెయ్యికి పెంచాలని తాజాగా ఆర్టీసీ నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేలా డ్రైవర్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. -
‘పోలీస్ బోర్డు’ ద్వారా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ‘పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు’ ద్వారా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ఎంపిక చేయనున్నారు. ఆర్టీసీలో మూడు వేల ఖాళీల భర్తీకి ఇటీవల ఆ సంస్థ ప్రతిపాదించింది. ఆర్థికశాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఆ ప్రతిపాదన ఎన్నికల కోడ్ ముగిశాక సీఎం పరిశీలనకు వెళుతుంది. దానికి ఆయన ఆమోదముద్ర వేయగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కు ఆర్టీసీ ఉద్యోగుల ఎంపిక బాధ్యత అప్పగించటంపై ఆయన ఎలాంటి అభ్యంతర్థిరం వ్యక్తం చేయకపోతే ఈ నియామకాలు చకచకా జరుగుతాయి. టీఎస్పీఎస్సీ అనాసక్తితో.. దశాబ్దాలుగా అంతర్గత ఉద్యోగాల నియామకా లను సొంతంగా ఆర్టీసీనే చూస్తూ వచ్చింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఓ దశలో దీనిని ప్రశ్నించింది. ప్రభుత్వ సంస్థల్లో అన్ని రకాల నియామకాలను టీఎస్పీఎస్సీ పర్యవేక్షిస్తుండగా, ఆర్టీసీలో ఆ సంస్థ చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో అప్పటి వరకు నియామకాలు లేకపోవటం, తొలిసారి ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన తరుణంలో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగాల ఎంపిక కూడా టీఎస్పీఎస్సీనే చూడాలని ఆదేశించింది. తొలుత ఆర్టీసీ ఫైనాన్స్, పర్సనల్ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టింది. కానీ అప్పట్లో వాటి నియామకాలు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. డ్రైవర్ల నియామక ప్రక్రియ వరకు వచ్చేసరికి టీఎస్పీఎస్సీ చేతులెత్తేసింది. ఇతర ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో బిజీగా ఉండగా, వీటిని చేపట్టడం సాధ్యం కాదని పేర్కొంది. దీంతో విషయం నాటి ప్రభుత్వ చివరిదశలో మరోసారి ప్రభుత్వ పరిశీలనకు వెళ్లింది. మళ్లీ దీనిపై సమాలోచనలు చేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అప్పగించింది. ఈలోపు ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారిపోవటంతో ఆ ప్రక్రియ అలాగే ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కలి్పంచటంతో బస్సుల సంఖ్య భారీగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఉద్యోగుల కొరత ఉన్న సమయంలో కొత్త బస్సులు సమకూర్చుకుంటే వాటి నిర్వహణ అసాధ్యంగా మారే పరిస్థితి ఉంది. దీంతో 8 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని నిర్ణయించి ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదించింది. అన్ని నియామకాలు వద్దని ఆర్థికశాఖ మౌఖికంగా సూచించంతో 3 వేల పోస్టుల భర్తీకి మళ్లీ ప్రతిపాదించింది. ఇందులో 2 వేల మంది డ్రైవర్లు ఉండగా శ్రామిక్లు, డిపో మేనేజర్లు ఇలా మిగతా విభాగాలకు చెందిన మరో వెయ్యి మంది ఉన్నారు. సీఎం గ్రీన్సిగ్నల్ ఇస్తే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మూడు వేల ఆర్టీసీ ఖాళీల భర్తీ ప్రక్రియ చేపడతారు.డ్రైవర్ల డబుల్ డ్యూటీ రూ.వెయ్యికి పెంపు ప్రస్తుతం ఆర్టీసీలో ‘లక్షే లక్ష్యం’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. 2017 నాటి వేతన సవరణ అమలు చేయనుండటంతో ఆర్టీసీపై రోజువారీగా రూ.కోటి చొప్పున భారం పడుతుంది. ఆ భారాన్ని పూడ్చుకునేందుకు సంస్థ, రోజువారీ ఆదాయాన్ని రూ.కోటి మేర అదనంగా పెంచుకోవాలని నిర్ణయించింది. ఇందుకుగాను ప్రతి డిపో రోజుకు రూ.లక్ష చొప్పున ఆదాయాన్ని పెంచుకునే కసరత్తు ప్రారంభించింది. లక్షే లక్ష్యం పేరుతో దీనిని చేపట్టింది. కానీ, ఈ రూపంలో డ్రైవర్లపై భారం మరింత పెరిగిందంటూ ఇటీవల డిపో మేనేజర్లు ఎండీ దృష్టికి తెచ్చారు. తీవ్ర ఎండలున్న ప్రస్తుత తరుణంలో ఇది ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. దీంతో మే, జూన్ నెలలకు సంబంధించి డ్రైవర్ల డబుల్ డ్యూటీ మొత్తాన్ని రూ.వెయ్యికి పెంచాలని తాజాగా ఆర్టీసీ నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేలా డ్రైవర్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. -
వారంపాటు తీవ్ర వడగాడ్పులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న వారం రోజులపాటు వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకుతోడు పొడి వాతావరణం, దక్షిణ, నైరుతి దిశల నుంచి గాలుల ప్రభావం వల్ల వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందని తెలిపింది. ముఖ్యంగా 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల ఈ నెల 6వ తేదీ వరకు తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అయితే ఈ నెల 6 వరకు తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నప్పటికీ అక్కడక్కడా తేలికపాటి వానలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రామగుండం.. అగ్నిగుండం.. మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే రామగుండంలో 44.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఖమ్మంలో సాధారణం కంటే 3.6 డిగ్రీలు, భద్రాచలం, మహబూబ్నగర్, హైదరాబాద్లలో 3 డిగ్రీల చొప్పున అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా జైనలో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 46.2, జగిత్యాల జిల్లా అల్లీపూర్లో 46.1, కొల్వాయ్ 46 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లోకెల్లా ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
నేను లేక.. మీరుండలేరు..!
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- నిట్టనిలువునా చీలిపోతున్న 127 ఏళ్ల కంపెనీ
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- నేను లేక.. మీరుండలేరు..!
- ‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
Advertisement